Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ప్రజా సంక్షేమం అభివృద్ధి ముఖ్యమంత్రి లక్ష్యం

ఏలూరు:ప్రజాసంక్షేమం, అభివృద్దే ముఖ్యమంత్రి జగన్ ముఖ్య సంకల్పమని నగరపాలక సంస్థ కో-ఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు అన్నారు. మంగళవారం నగరంలోని 41,43,45,46,48,50 డివిజన్లో జరిగిన పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో వైసిపి నగర అధ్యక్షులు బోద్దని శ్రీనివాస్ , నాయకులు నెరుసు చిరంజీవి తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ నేతృత్యంలోని రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, రాబోయే ఎన్నికల్లో వైసిపి గెలుపుకు శ్రీకారం చుడుతుందన్నారు.పార్టీ బలోపేతానికి అందరూ కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఈదుపల్లి కళ్యాణ్ పవన్, జనపరెడ్డి రాజేశ్వరి కృష్ణ, అయేషా రియాజ్, ఇలియాస్ ఫాషా , వైసిపి ఏలూరు మహిళా అధ్యక్షులు నున్న స్వాతి కిషోర్, బిసి సెల్ అధ్యక్షులు పోరిపిరెడ్డి నాగేశ్వరరావు,యువజన విభాగం అధ్యక్షులు నిడికొండ నరేంద్ర , డివిజన్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img