Thursday, April 18, 2024
Thursday, April 18, 2024

రైతులు ఈ-క్రాప్ చేయించుకోవాలి

ఎడిఎ మురళీకృష్ణ

నిడమర్రు: పంట సాగు చేస్తున్న ప్రతి రైతు ఈ- క్రాప్ నమోదు చేయించుకున్నాక మాత్రమే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు అవుతాయని తాడేపల్లిగూడెం వ్యవసాయ సహాయ సంచాలకులు పి మురళీకృష్ణ అన్నారు. బుధవారం నిడమర్రు మండలంలోని ఎనికేపల్లి, బువ్వనపల్లి గ్రామాలల్లో మండల వ్యవసాయ అధికారి బిన్సీ బాబు, రెవెన్యూ సిబ్బందితో కలిసి ఈ-క్రాప్ నమోదు విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎడిఎ మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాల్లో సంబంధిత గ్రామ వ్యవసాయ సహాయకులు వద్ద తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయించుకుని రైతులు సాగు చేస్తున్న పంట వివరాలను ఈ-క్రాప్ నమోదు చేయించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ వ్యవసాయ సహాయకులు, రెవిన్యూ సిబ్బంది, రైతులు, కౌలు రైతులు పాల్గొన్నారు.

ఈ- క్రాప్ నమోదు కార్యక్రమాన్ని పరిశీలిస్తున్న వ్యవసాయ అధికారులు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img