Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

గ్లోబల్ గ్రేస్ హెల్త్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

కొయ్యలగూడెం: గ్లోబల్ గ్రేస్ హెల్త్ వారి సహకారంతో కొయ్యలగూడెం జిడిఎం చర్చ్ ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. హైదరాబాద్ కు చెందిన గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ వైద్యుల బృందంతో అన్ని రకాలుగా 280 రోగులను పరీక్షించి ఉచిత మందులను పంపిణీ చేయడం జరిగిందని ఫీడర్ రాజు తెలిపారు. ఉచిత మెగా వైద్య శిబిరాన్ని పోలవరం శాసనసభ్యులు తెల్లం బాలరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ వివిధ స్వచ్ఛంద సేవా సంస్థల ద్వారా పేద ప్రజలకు అందజేస్తున్న మెగా వైద్య శిబిరాల ద్వారా ఎంతోమంది పేద ప్రజలు ఆరోగ్యాలను కాపాడు కుంటున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ ద్వారా కూడా అనేకమంది ఆరోగ్యo పట్ల లబ్ధి పొందుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గoజి మాల రామారావు, మండల పరిషత్ మాజీ అధ్యక్షుడు మట్ట సత్యనారాయణ( సత్తిపండు) పట్టణ అధ్యక్షుడు శంకు కొండలరావు, నూకల రాము, జిడిఎం చర్చ్ సంఘ కాపరి మద్దాల వర కుమార్, సంఘ సభ్యులు చిడిపి రవి, ఆశీర్వాదం, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img