Friday, April 26, 2024
Friday, April 26, 2024

రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం

కొయ్యలగూడెం: అభివృద్ధి పథంలో రాష్ట్రం వెనుకబడిందని టిడిపి పోలవరం నియోజకవర్గం ఇంచార్జ్ బోరగం శ్రీనివాస రావు విమర్శించారు. గవరవరం గ్రామంలో మండల పార్టీ అధ్యక్షులు వాడపల్లి నాగార్జున ఆధ్వర్యంలో బాదుడే బాదుడు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుపేద వాడు జీవించాలంటే కష్టతరంగా మారిందని రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజా క్షేమాన్ని కోరుకోకుండా తన స్వార్థం కోసం రాష్ట్ర అభివృద్ధిలో విఫలం చెందారన్నారు. నాగార్జున మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెంచడంతో పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రానున్న ఎన్నికల్లో టిడిపిని గెలిపించి చంద్రబాబును ముఖ్యమంత్రి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img