విశాలాంధ్ర – మార్టూరు: జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ గారి 51 వ జన్మదిన వేడుకలను మండలంలో ఘనంగా నిర్వహించారు. ద్రోణాదుల గ్రామంలో మార్టూరు సామాజిక ఆరోగ్య కేంద్రం బ్లడ్ స్టోరేజ్ వారి సహకారంతో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో మార్టూరు మండలం జనసైనికులు 60 యూనిట్ల రక్తాన్ని దానం చేశారు, జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెదపూడి విజయ్ కుమార్, మండల అధ్యక్షుడు మందపాటి కిషోర్ ఉపాధ్యక్షులు మోహన్ రావు, కొండపల్లి, ప్రధాన కార్యదర్శి తిరుమల శెట్టి శ్రీనివాసరావు ప్రవీణు ప్రేమ్కుమార్ ఒంగోలు నగర కార్పోరేటర్ ఎలాగా రమేష్ , జిల్లా కార్యదర్శి రాయిని రమేష్ సంయుక్త కార్యదర్శి షేక్ ఇండియా ప్రోగ్రాం కమిటీ కార్యదర్శులు భక్తుల రామకృష్ణ, అశోక్, సతీష్, పాల్, మరియు ఇతర జనసైనికులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.