Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

డిఐఒ ఆకస్మిక తనిఖీలు

చింతలపూడి: చింతలపూడి లోజిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
చింతలపూడి లో డెంగ్యూ వ్యాధి నుండి కోరుకున్న రోగులను జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి ముళ్లగిరి నాగేశ్వరరావు పరామర్శించారు. చింతలపూడి, నాగిరెడ్డిగూడెం, రేచర్లలో డెంగ్యూ కేసులు వివరాలను సమీక్షలు యం నాగేశ్వరరావు నిర్వహించారు. జ్వరాలు ప్రభలకుండా వైద్య ఆరోగ్య సిబ్బంది పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవాలని
డిఐఒ ఆదేశించారు. మంగళవారం స్థానిక రామకృష్ణ నగర్, మెరకవీధి లో యర్రగుంటపల్లి ప్రాధమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వైద్య ఆరోగ్య శిబిరంను ఆకస్మికంగా తనిఖీ చేశారు. గతంలో డెంగ్యూ వ్యాధికి గురి అయి కోలుకొన్న చోడా విధ్య, ఇంధనం అఖిల్, అనే రోగుల ఇంటికి వెళ్లి పరామర్శించారు. స్థానికంగా ఉండే పలు గృహాలు సందర్శించి వైద్య ఆరోగ్య సిబ్బంది చేపట్టిన చర్యలు గురించి అడిగి తెలుసుకున్నారు. డెంగ్యూ, మలేరియా, వైరల్ జ్వరాలు వంటి సీజనల్ వ్యాధులు ప్రబల కుండా ఉండేందుకు ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలు లేకుండా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ముఖ్యంగా ఇంటి నివాసిత ప్రాంతాల్లో వుండే ఓవర్ హెడ్ ట్యాంక్, సెప్టిక్ ట్యాంక్, ఫ్రిజ్, కూలర్ లలో నుండి ఈ డెంగ్యూ, మలేరియా వ్యాఫ్తి దోమలు ప్రభలకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
చింతలపూడి నగర పంచాయతీ కమిషనర్ నల్లా రాంబాబు తో సమావేశం జరిపి పట్టణ పరిధిలో పారిశుధ్య పనులు గురించి తగిన సూచనలు చేశారు.యర్రగుంటపల్లి ప్రాధమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి పి. మానస, యంపి హెచ్ ఇఓ శ్రీనివాసరావు, హెచ్ వి పరిమళ కుమారి, హెల్త్ అసిస్టెంట్ లు సయ్యద్ జఫ్రుల్లా, యం బాలరాజు, ఏయన్ యం లు పుష్ప, కె కుమారి, ఆశావర్కర్లు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img