ఏలూరు: నగరపాలక సంస్థ కమిషనర్ షేక్ సాహిద్ వెహికల్ డిపోను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు, వాహనాలకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరపాలక సంస్థ వాహనాలను వర్కింగ్ కండిషన్ పరిశీలించి, మరమ్మతులు అవసరం ఉంటే త్వరితగతిన చేయించి పారిశుద్ధ్య పనులకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అనంతరం నగరములో పారిశుద్ధ్య కార్యక్రమాలపై క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ చేపట్టారు. అనంతరం నగరంలోని 31,42,43 వ డివిజన్లు నందు శానిటేషన్ కార్యక్రమాన్ని పరిశీలించారు.
43 వ డివిజన్ నందు జరుగుతున్నటువంటి సిసి రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించడం జరిగింది.