Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

టిడిపి గెలుపే నా లక్ష్యం

పర్వతనేని గంగాధర్

చాట్రాయి : తెలుగు దేశం పార్టీని నూజివీడు నియోజకవర్గం లో గెలిపించడమే ఏకైక లక్ష్యంగా నిరంతరం పనిచేస్తున్నానని పర్వతనేని గంగాధర్ తెలిపారు. నూజివీడు అసెంబ్లీ స్థానం తెలుగుదేశం
అభ్యర్థిత్వం కోసం గట్టిగా ప్రయత్నిస్తున్న పర్వతనేని గంగాధర్ ను వారి నివాసంలో చాట్రాయి మండలం సోమవారం మాజీ సర్పంచ్ ఎర్రోజు సత్యనారాయణ టిడిపి మండల మాజీ అధ్యక్షులు
ఓబిళ్ళనేనిసాయిబాబా, తెలుగు రైతు జిల్లా మాజీ కార్యదర్శి బొంతు సత్యనారాయణ తదితరులు వారి
అనుచరులతో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పర్వతనేని గంగాధర్ మాట్లాడుతూనూజివీడు నియోజకవర్గంలో టిడిపిని గెలిపించి చంద్రబాబు ముఖ్యమంత్రి కావడానికి తాను సాయి శక్తులా కృషిచేసి, తన వంతు బాధ్యతగా పని చేస్తానని తెలిపారు. పార్టీలో నిస్తేజంలో వున్న యువతలో ఉత్తేజం నింపడానికి, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న దళిత బడుగు, బలహీన వర్గాల కార్యకర్తలకు ఆర్థికంగాతనకు చేతనైనంత చేయూతనివ్వడం, సేవాకార్యక్రమాలు చేస్తున్నానన్నారు. అసెంబ్లీ టిక్కెట్ ఎవరికొచ్చినా, అభ్యర్థి ఎవరైనా గెలవడం అహర్నిశలు శ్రమిస్తానన్నారు. విభజన రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్లడానికి నిరుద్యోగ యువతకు ఉద్వోగా అవకాశాలు కల్పించడం కోసం విదేశాల నుంచి కూడా అనేక కంపెనీలను చంద్రబాబు ఇక్కడకు రప్పించగా జగన్ సీఎం కావడం తో ఎక్కడి కార్యక్రమాలు అక్కడే ఆగిపోయాయన్నారు. ఈ రాష్ట్రం మళ్లీ పురోభివృద్ధి వైపు పయనించాలంటే చంద్రబాబు ను సీఎంను చేయడం ఒక్కటే మార్గమన్నారు. చంద్రబాబు సీఎం కావాలంటే ప్రతీ అసెంబ్లీ స్తానం లో ముందు టిడిపి కార్యకర్తలు, అభిమానులు ,శ్రేయోభిలాషులు గ్రామ, వార్డు స్థాయి నుంచి చైతన్య స్ఫూర్తితో ముందడుగు వేయాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీలో గ్రూపులు కట్టడంకు తాను వ్యతిరేకమన్నారు. అందరూ కలిసికట్టుగా పని చేస్తేనే పార్టీని గెలిపించుకోవడానికి ముందుకు తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుందన్నారు. నిరుపేదల తో మమేకమై వారి మధ్య ఉంటూ, వారితో కలిసి పని చేస్తూ టిడిపి గెలుపు కోసం శ్రమిస్తానని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img