Friday, May 3, 2024
Friday, May 3, 2024

ప్రజా సమస్యల పరిష్కార దిశలో “విశాలాంధ్ర” పాత్ర అమోఘం

విశాలాంధ్ర – పెనుమంట్ర: సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను ప్రజా ప్రతినిధులు, అధికారుల దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకువచ్చి వాటి పరిష్కారానికి విశాలాంధ్ర దినపత్రిక చేస్తున్న కృషి ఎనలేనదని పెనుమంట్ర మండల పరిషత్ అధ్యక్షులు కర్రి వెంకటనారాయణ రెడ్డి ( వాసు) కొనియాడారు. శుక్రవారం బ్రాహ్మణ చెరువు మండల పరిషత్ కార్యాలయంలో విశాలాంధ్ర దినపత్రికచే నూతన సంవత్సర క్యాలెండను ఎంపీపీ కర్రి వెంకటనారాయణ రెడ్డి (వాసు), ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ డెవలప్మెంట్ కమిటీ డైరెక్టర్ కొవ్వూరి వేణు మాధవరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వాసు మాట్లాడుతూ ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు వెలుగులోకి తీసుకుని వస్తూనే వాటి పరిష్కారానికి చక్కటి పరిష్కారం తెలియ చేసినప్పుడే ఆ పత్రికలను ప్రజలు ఆదరిస్తారని అన్నారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో స్థానిక ఎంపీడీవో పి. పద్మజ, ఏ.వో. వి. పూర్ణ బాబ్జి, సీనియర్ అసిస్టెంట్ కె. ఎస్. ఎన్. శ్రీనివాస్, జూనియర్ అసిస్టెంట్ చింతపల్లి ఉదయ్ కిరణ్, ఎస్. శివకుమార్,రిపోర్టర్ టి.వి రాజు, ఎంపీడీవో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img