Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

ఉద్యమ సూర్యుడు ఎంవిఎస్ రాజు

సంతాప సభలో వక్తలు

గణపవరం: రాష్ట్ర రైతు కార్యాచరణ సమితి అధ్యక్షులు మంతెన వెంకట సూర్యనారాయణరాజు ఈనెల 16వ తేదీన మృతి చెందగా గణపవరం శ్రీ కన్యకా పరమేశ్వరి వర్తక సంఘ భవనంలో ఏర్పాటు చేసిన ఎం వి ఎస్ రాజు సంస్కరణ నివాళి సభ జరిగింది. ఈ సభకు రాష్ట్ర రైతు కార్యాచరణ సమితి నాయకులు రుద్రరాజు వెంకట సూర్యనారాయణ( ఆర్ వి ఎస్ రాజు) అధ్యక్షతన ఈ సభ జరిగింది. ఈ సభకు ముఖ్యఅతిథిగా ఉండి నియోజకవర్గం సామాజిక సేవా నాయకులు డివి సుబ్రహ్మణ్యం హాజరై మాట్లాడుతూ మంతెన వెంకట సూర్యనారాయణ రాజు బాల్యం నుండి స్వాతంత్ర్య సమర పోరాటంలో పాల్గొని విశాలాంధ్రప్రదేశ్ లో రైతు సమస్యల మీద ఉద్యమం చేశారన్నారు. ఆర్ వి ఎస్ రాజు మాట్లాడుతూ ఆయన పోలవరం ప్రాజెక్ట్ కొల్లేరు సరస్సు ప్రజలకు మంచినీరు అందించాలని ఆశయంతో ఆయన ఉద్యమం లో పాల్గొన్నారని, ఆయన ఆశయాలను మనము, మన భావితరాలు అనుసరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాదేటి సురేష్ కుమార్, వంకాయల రామారావు, నడిపల్లి రాంపండు, భైరబోయిన మాలాద్రి యాదవ్, వేగేశ్న కొండరాజు, వి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

మంతెన సూర్యనారాయణ రాజు సంతాప సభలో మాట్లాడుతున్న వక్తలు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img