ఇంటర్ ఫస్టియర్ అడ్మిషన్లపై ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. అడ్మిషన్ ప్రక్రియ గడువును మరోసారి పెంచుతూ ఈ రోజు ఉత్తర్వులు జారీ చేసింది.2021-2022 విద్యా సంవత్సరానికి గాను ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి గడువు ఆగస్టు 17 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇంటర్ బోర్డ్ కార్యదర్శి జలీల్ ఆదేశాలు జారీ చేశారు.