Friday, April 26, 2024
Friday, April 26, 2024

ప్రకాశం బ్యారేజ్‌కి చేరనున్న భారీ వరద నీరు

జిల్లా యంత్రాంగం అప్రమత్తం
ప్రకాశం బ్యారేజ్‌కి రానున్న భారీ వరద నీరు చేరనుంది. రేపు మధ్యాహ్నానికి లేదా సాయంత్రానికి బ్యారేజీకి సుమారు 5 లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరుతుందని అధికారులు తెలిపారు. శ్రీశైలం, సాగర్‌ ప్రాజెక్టులు పూర్తిగా నిండిపోవడంతో వరద నీటిని విడుదల చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్ట్‌ ఇప్పటికే నిండిపోయింది. దీంతో జగ్గయ్యపేట నుంచి అవనిగడ్డ వరకు నదీ పరీవాహక ప్రాంతాలను అప్రమత్తం చేసినట్లు కలెక్టర్‌ నివాస్‌ తెలిపారు. కృష్ణా నదీ వరదలపె సమీక్ష నిర్వహించారు. విజయవాడ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఆదేశించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img