తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత
కొవిడ్ తీవ్రత సమయంలో మద్యం విక్రయాల సమయం పొడిగించడమేంటి? అని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత ప్రశ్నించారు.మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం కోసం ప్రజల ప్రాణాలను పణంగా పెడతారా? అని నిలదీశారు.అనాలోచిత నిర్ణయాలతో జగన్రెడ్డి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారని మండిపడ్డారు.ప్రభుత్వ మూర్ఘపు నిర్ణయాలతో మహిళలపై గృహహింస , హత్యలు, అత్యాచారాలు పెరిగాయన్నారు. మద్యం విక్రయాల సమయం పొడిగింపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వంగలపూడి అనిత డిమాండ్ చేశారు.