టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం ట్వీట్ చేశారు కోవిడ్ నుంచి త్వరగా కోలుకొని పూర్తి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానన్నారు. ఇపుడు సీఎం జగన్ చేసిన ట్వీట్ వైరల్గా మారింది. కాగా ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.తనకు కరోనా సోకిన విషయాన్ని స్వయంగా చంద్రబాబు మంగళవారం ఉదయం సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.