Monday, May 6, 2024
Monday, May 6, 2024

కేజీబీవీలను మరిన్ని ప్రారంభించాలని ప్రభుత్వ యోచన

: మంత్రి సబితా ఇంద్రారెడ్డి
కేజీబీవీలను మరిన్ని ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది అని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. కేజీబీవీలు, ఆదర్శ పాఠశాలలపై శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. తెలంగాణలో 475 కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు, 194 ఆదర్శ పాఠశాలలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. కేజీబీల స్థాయిని పెంచే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు. ఆదర్శ పాఠశాలలు ఇంటర్మీడియట్‌ వరకు పని చేస్తున్నాయి. కేజీబీవీల్లో మౌలిక సదుపాయాలను ఎప్పటికప్పుడు అంచనా వేసి కల్పిస్తున్నాం. ఆదర్శ పాఠశాలల్లో సరిపడా మౌలిక సదుపాయాలు ఉన్నాయని పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img