తెలంగాణ ప్రభుత్వం కరోనా టీకా డ్రైవ్లో మరో మైలురాయికి చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 2.5 కోట్ల మందికి కనీసం సింగిల్ డోస్ ఇచ్చినట్లు ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడిరచారు. రాష్ట్రంలో టీకాకు అర్హులైన వారు 2.87 కోట్ల మంది ఉన్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఇందులో గురువారం వరకు 2.50 కోట్ల మంది కనీసం సింగిల్ డోస్ తీసుకున్నట్లు తెలిపారు. మొత్తంగా ఇప్పటి వరకు 87 శాతం వ్యాక్సినేషన్ పూర్తయింది. ఇక 1,81,95,430 మొదటి డోసు తీసుకోగా, రెండు డోసులు తీసుకున్న వారి సంఖ్య 68,37,327లుగా ఉంది.18 నుంచి 44 ఏండ్ల మధ్య వయసున్న వారిలో 1,01,03,812 మంది మొదటి డోసు తీసుకున్నారు. 26,78,710 మంది రెండు డోసులు తీసుకోగా.. 1,27,82,522 మంది కనీసం సింగిల్ డోసు తీసుకున్నట్లు వెల్లడిరచారు.