Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

డిసెంబరులో ప్రొ కబడ్డీ లీగ్‌

న్యూదిల్లీ : దేశవ్యాప్తంగా తక్కువ సమయంలోనే ప్రాచుర్యం పొందిన ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌) డిసెంబరులో ప్రారంభం కానుంది. ఐపీఎల్‌ తర్వాత దేశంలో అత్యంత విజయవంతమైన లీగ్‌గా ప్రొ కబడ్డీకి గుర్తింపు ఉంది. ఈ కబడ్డీ లీగ్‌లో పాల్గొన్న కొందరు ఆటగాళ్లు కోటీశ్వరులయ్యారు కూడా. నిజానికి ఈ సీజన్‌ 2020 లోనే జరగాల్సి ఉన్నా.. కోవిడ్‌ కారణంగా వాయిదా పడిరది. అలాంటి ప్రొ కబడ్డీ లీగ్‌ 8వ సీజన్‌ డిసెంబర్‌ 22 నుంచి మళ్లీ అలరించనున్నట్లు ఈ లీగ్‌ నిర్వాహక సంస్థ మాషల్‌ స్పోర్ట్స్‌ మంగళవారం వెల్లడిరచింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img