టీడీపీ అధినేత చంద్రబాబు
జగన్ పాలనలో నిర్వీర్యమవుతున్న సాగునీటి ప్రాజెక్టుల సందర్శనకు టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. పార్టీ ముఖ్యనేతల భేటీ అయిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సాగునీటి రంగాన్ని జగన్ అజ్ఞానంతో నిర్వీర్యం చేస్తున్నారని అన్నారు. పోలవరం, నదుల అనుసంధానాన్ని కమీషన్ల కోసం అస్తవ్యస్తం చేస్తున్నారని మండిపడ్డారు. కమీషన్ల కోసం పోలవరం ప్రాజెక్టు లోపల మరో ఎత్తిపోతల పథకం అంటున్నారని అన్నారు. వైసీపీ పాలనలో ప్రజలకు అప్పులు.. జగన్ బినామీలకు ఆస్తులు పెరిగాయన్నారు.