Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

టీడీపీ కేంద్ర కార్యాలయానికి మంగళగిరి పోలీసుల నోటీసులు

మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్‌ భవన్‌కు మంగళగిరి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఇటీవల కార్యాలయంపై పలువురు దాడి చేసిన నేపథ్యంలో సీసీ ఫుటేజీ ఇవ్వాలంటూ టీడీపీ కార్యాలయానికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. విచారణలో భాగంగా ఇవాళ సాయంత్రం 5 గంటల్లోగా మంగళగిరి రూరల్‌ పోలీస్‌ స్టేషనుకు వచ్చి వివరాలు అందివ్వాలని రిస్పెషన్‌ కమిటీ సభ్యుడు కుమార స్వామికి నోటీసులు జారీ చేశారు. టీడీపీ కార్యాలయం గోడకు పోలీసులు నోటీసులు అంటించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img