టీడీపీ పార్టీ కార్యాలయంపై దాడి కేసులో పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. దాడికి పాల్పడిన పదిమందిని గుర్తించి అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు.పానుగంటి చైతన్య, పల్లపు మహేష్ బాబు, పేరూరి అజయ్, శేషగిరి పవన్కుమార్, అడపాల గణపతి, షేక్ అబ్దుల్లా, కోమటిపల్లి దుర్గారావు, జోగ రమణ, గోక దుర్గాప్రసాద్, లంక అభినాయుడుని పోలీసులు అరెస్ట్ చేశారు. మిగిలిన నిందితులను పట్టుకునేందుకు నాలుగు బృందాలను ఏర్పాటు చేశారు. మరోవైపు పట్టాభి ఇంటిపై దాడి కేసులో 11 మందిని పటమట పోలీసులు అరెస్ట్ చేశారు. సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.