డెహ్రాడూన్ : ఉత్తరాఖండ్లో కురిసిన భారీవర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటం వల్ల మృతుల సంఖ్య 72కు పెరిగింది. మరో నలుగురి జాడ కనిపించడం లేదని ఉత్తరాఖండ్ ప్రభుత్వం సోమవారం తెలిపింది. అక్టోబరు 17 నుంచి 19వ తేదీ వరకు వరదవిపత్తులో 26 మంది గాయపడ్డారు. భారీవర్షాలు, వరదల వల్ల పెద్దఎత్తున ప్రాణ, ఆస్తినష్టం జరిగింది. ఈ వరదల వల్ల 224 మంది మరణించారు. నదులు ఉప్పొంగి ప్రవహించాయి. ఉత్తరాఖండ్లో వరద విపత్తు వల్ల తీవ్ర నష్టం వాటిల్లడంతో సహాయ, పునరావాస పనులు చేపట్టేందుకు వీలుగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి సీఎం పుష్కర్ సింగ్ ధామి అక్టోబరు నెల జీతాన్ని విరాళంగా అందిస్తున్నట్లు ప్రకటించారు.