Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఆత్మగౌరవం, ధర్మాన్ని గెలిపించుకోవాలి : ఈటల రాజేందర్‌

హుజూరాబాద్‌లో పోలీసులే స్వయంగా రక్షణ కల్పించి అధికార పార్టీ డబ్బులు పంచేలా చేశారని బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ ఆరోపించారు. కమలాపూర్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం ఆయన మాట్లాడుతూ, తనను అసెంబ్లీలో చూడొద్దని సీఎం కేసీఆర్‌ గట్టిగా పంతం పట్టినట్లున్నారని, అందుకే అధికారం యంత్రాంగం సాయంతో సర్వశక్తులు ఒడ్డుతుఆన్నరని ఆరోపించారు. నియోజకర్గంలో మద్యం ఏరులైపారిందని, రూ.వందల కోట్లు పంపిణీ చేశారని ఆరోపించారు. ప్రజలు దీన్ని ఎదుర్కోవాలని, ఆత్మగౌరవం, ధర్మాన్ని గెలిపించుకోవాలని ఈటల పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img