Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

రైతుల ముసుగులో చేస్తున్న పాదయాత్ర : పేర్ని నాని

పాదయాత్ర పేరుతో చంద్రబాబు మరోసారి మోసం చేస్తున్నారని ఏపీ రవాణా, సమాచారశాఖ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ముసుగులో చేస్తున్న అమరావతి పాదయాత్ర హాస్యాస్పదమని అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, రైతు ముసుగులో టీడీపీ నేతలు పాదయాత్రలు చేస్తున్నారని, కోర్టులను కూడా మోసం చేసి టీడీపీ దొంగ యాత్రలు చేస్తోందని అన్నారు.పాదయాత్ర పేరుతో నల్లడబ్బును తెల్లడబ్బుగా చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. రైతుల పేరుతో రియల్‌ ఎస్టేల్‌ వ్యాపారులు యాత్రచేస్తున్నారని, చంద్రబాబు, ఏజెంట్లు, బినామీలు పాదయాత్ర చేస్తున్నారని దుయ్యబట్టారు. ఈ యాత్రకు నిర్మాత, దర్శకుడు, స్క్రీన్‌ప్లై చంద్రబాబేనని విమర్శించారు. పార్టీ కార్యకర్తలను కూడా చంద్రబాబు దిగజార్చుతున్నారని అన్నారు. ‘రైతుల పేరిట రియల్‌ఎస్టేట్‌ పాదయాత్ర చేయడం కడు హీనమైనది. ఇలా చేయడం దిగజారుడుతనానికి నిదర్శనం. పాప ప్రక్షాళన యాత్రను చంద్రబాబు ఓ ఎత్తుగడగా తీసుకున్నారు. యాత్ర రూట్‌ మ్యాప్‌ చూస్తే దాంట్లో ఎంత కుట్ర ఉందో అర్థమవుతుంది.’ అని అన్నారు. రైతుల పేరుతో ఉన్న పెట్టుబడిదారుల్ని నట్టేట ముంచిందెవరని ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img