Friday, May 3, 2024
Friday, May 3, 2024

నాకు జరిగిన ఈ అవమానం మరెవరికీ జరగకూడదు

అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై భువనేశ్వరి లేఖ

ఏపీ అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి, ఎన్టీఆర్‌ మెమోరియల్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ నారా భువనేశ్వరి స్పందించారు. తనకు జరిగిన ఈ అవమానం మరెవరికీ జరగకూడదని, తనపై చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల నిరసన వ్యక్తం చేసిన వారందరికీ ఆమె ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేశారు. ‘నాకు జరిగిన అవమానాన్ని మీ తల్లి, తోబుట్టువు, కూతురికి జరిగినట్లుగా భావించి నాకు అండగా నిలబడటం నా జీవితంలో మర్చిపోలేను. చిన్నతనం నుంచి మా తల్లిదండ్రులు మమ్మల్ని విలువలతో పెంచారు. నేటికీ మేము వాటిని పాటిస్తున్నాం. విలువలతో కూడిన సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి. కష్టాల్లో, ఆపదలో ఉన్న వారికి అండగా నిలబడాలి. ఇతరుల వ్యక్తిత్వాన్ని కించపరిచేలా, గౌరవానికి భంగం కలిగించేలా ఎవరూ వ్యవహరించకూడదు.నాకు జరిగి ఈ అవమానం మరెవరికీ జరగకుండా ఉండాలని ఆశిస్తున్నాను.’ అని ఆమె ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img