Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

ఓర్పు, నేర్పు కలిగిన మంచి వక్త..రోశయ్య

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి రోశయ్య మృతి పట్ల ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. తాను, రోశయ్య ఒకేసారి సీఎంలుగా పనిచేశామని ప్రధాని అన్నారు. ‘వారు నాకు చిరకాల మిత్రులు. విషయ పరిజ్ఞానంతో కూడిన వారి అనుభవం కీలక సమయాల్లో రాష్ట్రానికి దిశానిర్ధేశం చేసింది. ఓర్పు, నేర్పు కలిగిన మంచి వక్తగా ఆయన అందరి అభిమానాన్ని చూరగొన్నారు.’ అని అంటూ రోశయ్య కుటుంబ సభ్యులకు ప్రధాని మోదీ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img