వ్యాక్సిన్ వేసుకున్నా మాస్క్ తప్పనిసరని డీఎంహెచ్వో శ్రీనివాస్ రావు అన్నారు. ఒమిక్రాన్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతుందని, రెండు రోజుల్లోనే డబుల్ అయ్యే సామర్థ్యం ఉందన్నారు. ఒమిక్రాన్ సైతం గాలి ద్వారా సోకుతుందన్నారు.చాలా స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయని చెప్పారు. నాన్ రిస్క్ దేశాల నుంచి వచ్చే వారికి టెస్టింగ్ ని పెంచుతామన్నారు. ఓ ప్రైవేట్ ఆస్పత్రి నుంచి ఒకరు పరిపోయారన్న వార్తల్లో వాస్తవం లేదని తెలిపారు. 50% మాస్క్ ల వినియోగం పెరిగిందన్నారు. ఒమిక్రాన్ వేరియంట్ ని సైతం కోవిడ్ నియమాలు పాటించి నియంత్రించవచ్చన్నారు.ఇంట్లో బయటా ఎప్పుడు మాస్క్ ధరించాలన్నారు.. 97%మందికి మొదటి డోస్ పూర్తయిందని 29 లక్షల మందికి నేటికి రెండో డోస్ డ్యూ డేట్ ముగిసిందన్నారు. 4.19 కోట్ల వ్యాక్సిన్ డోస్ లు ఇప్పటివరకు ఇచ్చామన్నారు.