రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై తెలంగాణ హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. . ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతున్న క్రమంలో.. క్రిస్మస్, న్యూఇయర్ సంక్రాంతి వేడుకల్లో జాగ్రత్తలు చేపట్టాలని, ప్రజలు గుమికూడకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. రాష్ట్రంలో ఒమిక్రాన్ ఇప్పటికే ప్రవేశించిందని, ఈ వేరియంట్ వ్యాప్తిపై అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఢల్లీి, మహారాష్ట్ర తరహా నిబంధనలు పరిశీలించాని కోర్టు సూచించింది. రాష్ట్రాల సరిహద్దుల్లో కొవిడ్ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. కొత్త వేరియంట్ వ్యాప్తి నేపథ్యంలో పండగలపై ఆంక్షలు విధించాలని, రెండు, మూడు రోజుల్లో ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని తెలంగాణ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టంచేసింది.