విశాఖ నుంచి దిల్లీ వెళ్తున్న ఏపీ ఎక్స్ప్రెస్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో ఒక గంట పాటు రైలుని నిలిపివేశారు.ఏపీ ఎక్స్ప్రెస్ ఎస్ 6 బోగీలో ఒక్కసారిగా పొగలు రావడంతో వరంగల్ జిల్లా నెక్కొండ రైల్వే స్టేషన్ సమీపంలో డ్రైవర్ అప్రమత్తమై రైలును నిలిపివేశారు. ఒక్కసారిగా పొగలు చెలరేగడంతో ప్రయాణికులు ఆందోళనకు గురయాల్యరు. ప్రయాణికులు రైల్లో నుంచి పరుగులు తీశారు. రైల్వేస్టేషన్లో ఉన్న ప్రయాణికులు కూడా భయంతో పరుగులు పెట్టారు. రైలు బ్రేకులు జాం కావడంతో పొగలు వచ్చి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. దీనిపై విచారణ చేస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే ఈ ఘటనలో అందరూ సేఫ్గా ఉండడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.