Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

రూ.9,714 కోట్లతో హైదరాబాద్‌లో పేదల కోసం డబుల్‌ బెడ్రూం ఇళ్లు

: మంత్రి కేటీఆర్‌
రూ.9,714 కోట్లతో హైదరాబాద్‌లో పేదల కోసం డబుల్‌ బెడ్రూం ఇళ్లు కడుతున్నామని మంత్రి కేటీఆర్‌ చెప్పారు. ఖైరతాబాద్‌, ఇందిరానగర్‌లో డబుల్‌ బెడ్రూం పథకం కింద నిర్మించిన ఇళ్లను తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌తో కలిసి కేటీఆర్‌ ప్రారంభించారు. అనంతరం కేటీఆర్‌ మాట్లాడుతూ..మెయిన్‌ సెంటర్‌ పాయింట్‌లో ఈ ఇళ్లు కట్టామని, మార్కెట్‌లో ఒక్కో ఇంటి విలువ 50 లక్షల రూపాయలు ఉంటుందని, వాటిని తాము పేదలకు ఉచితంగా ఇస్తున్నామని తెలిపారు.కొల్లూర్‌ లో నిర్మించిన డబుల్‌ బెడ్రూం ఇళ్లను సీఎం కేసీఆర్‌ ప్రారంభిస్తారని ఆయన తెలిపారు. అక్కడ ఒకే చోట 15,640 డబుల్‌ బెడ్రూం ఇళ్లు నిర్మించామని తెలిపారు. ఇక తెలంగాణలో మొత్తం 18 వేల కోట్ల రూపాయలతో పేదల కోసం డబుల్‌ బెడ్రూం ఇళ్లు కడుతున్నామని చెప్పారు. పేదల కోసం ఖైరతాబాద్‌ నియోజకవర్గంలో ఫంక్షన్‌ హాల్‌ కోసం రూ.100 కోట్ల విలువచేసే స్థలం కేటాయించామని ఆయన తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img