Friday, April 26, 2024
Friday, April 26, 2024

విద్యాసంస్థల్లో ఆన్‌లైన్‌ బోధనపై హైకోర్టు కీలక ఆదేశాలు

తెలంగాణలో కరోనా హైకోర్టు విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. విద్యాసంస్థల్లో ఆన్‌లైన్‌ బోధన కూడా కొనసాగించాలని సూచించింది. ఈ నెల 20వ తేదీ వరకు ప్రత్యక్ష తరగతులతో పాటు ఆన్‌ లైన్‌ బోధన కొనసాగించాలని హైకోర్టు పేర్కొంది.ఇక హైదరాబాద్‌లో రద్దీ ప్రాంతాల్లో కొవిడ్‌ నిబంధనలు తప్పకుండా అమలుచేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. సమ్మక్క జాతరలో కరోనా నియంత్రణ చర్యలు అమలు చేయాలని సూచించింది. సమతామూర్తి సహస్రాబ్ది వేడుకల్లో కొవిడ్‌ నిబంధనలు అమలయ్యేలా చూడాలని ఏజీకి హైకోర్టు సూచనలు చేసింది. నిర్లక్ష్యం వల్ల కరోనా ప్రబలకుండా చర్యలు తీసుకోవడం ప్రభుత్వ బాధ్యత అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. రెండు వారాల్లో కరోనా పరిస్థితులపై మరోసారి నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. కరోనా పరిస్థితులపై విచారణ ఈనెల 20కి వాయిదా వేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img