Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

దేశంలో కరోనా తీవ్రత తగ్గుముఖం…కొత్తగా 58,077 కేసులు

దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖంపడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 58,077 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,25,36,137కు చేరాయి. ఇందులో 4,13,31,158 మంది వైరస్‌ నుంచి బయటపడ్డారు. మరో 6,97,802 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 5,07,177 మంది మృతిచెందారు. కొత్తగా 657 మంది మరణించామని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడిరచింది. అలాగే గత 24 గంటల్లో 1,50,407 రికవరీ కేసులు నమోదు అయ్యాయి. యాక్టివ్‌ కేసులు శాతం 1.64%, రికవరీ రేటు ప్రస్తుతం 97.17%గా ఉంది. అలాగే రోజువారీ సానుకూలత రేటు 3.89%, వారంవారీ సానుకూలత రేటు 5.76%గా నమోదు అయ్యింది. ఇప్పటి వరకు మొత్తం 74.78 కోట్ల మందికి పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో 14,91,678 పరీక్షలు నిర్వహించారు. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ కింద ఇప్పటి వరకు 171.79 కోట్ల వ్యాక్సిన్‌ డోస్‌లు పంపిణీ జరిగాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img