Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

పంజాబ్‌ ఎన్నికల వేళ ప్రధాని మోదీ చెక్క భజన!

ప్రముఖ కవి సంత్‌ రవిదాస్‌ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నేడు దిల్లీలోని విశ్రమ్‌ ధామ్‌ మందిరాన్ని సందర్శించారు. మందిరంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మందిరంలోని భక్తులతో కొంతసేపు మాట్లాడారు. విశ్రమ్‌ ధామ్‌ మందిరంలో నిర్వహించిన ‘షాదాబ్‌ కీర్తన్‌లో మోదీ పాల్గొన్నారు. సంప్రదాయ వాద్య పరికరాన్ని చేతిలో పట్టుకొని భజనలో పాల్గొన్నారు. భక్తులతో కలిసి కీర్తనలు ఆలపించారు. ఈ వీడియోను తన ట్విటర్‌ ఖాతా ద్వారా షేర్‌ చేశారు. ‘ప్రత్యేక క్షణాలు’ అని రాసుకొచ్చారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. గురు రవిదాస్‌ జయంతి పంజాబ్‌ దళితుల ప్రముఖ పండుగ. రవిదాస్‌ జయంతిని పురస్కరించుకునే ఈ ఏడాది పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల తేదీలను ఫిబ్రవరి 14 నుంచి ఫిబ్రవరి 20కి మార్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img