సీఎం కేసీఆర్ ఆరోపణలు అవాస్తవాలు : కేంద్ర మంత్రి ఆర్కే సింగ్
కరెంటు మీటర్ల అంశంపై కేసీఆర్, బీజేపీ మధ్య మాటల తూటాలు పేలాయి. తాజాగా దీనిపై కేంద్ర విద్యుత్ మంత్రిత్వశాఖ క్లారిటీ ఇచ్చింది. అపోహలు -వాస్తవాలు పేరిట కేంద్రమంత్రి ఆర్.కె.సింగ్ పేరుతో ప్రకటన విడుదల చేసింది.ఇటీవల జనగామ, భువనగిరిలో నిర్వహించిన బహిరంగసభల్లో సీఎం కేసీఆర్ కేంద్రంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. విద్యుత్ సంస్కరణల్లో భాగంగా కేంద్రం వ్యసాయ బోర్లు, బావుల మోటార్లకు మీటర్లు పెట్టాలని, మెడపై కత్తి పెట్టిందని ఆరోపించారు. అయితే కేసీఆర్ ఆరోపణలను కేంద్ర విద్యుత్ శాఖ ఖండిరచింది. వ్యవసాయ బోర్లు, బావుల వద్ద మోటార్లకు విద్యుత్ మీటర్లు పెట్టాలని రాష్ట్రాలను బలవంతం చేయట్లేదని స్పష్టం చేసింది. పునరుత్పాదక ఇంధన వినియోగానికి సంబంధించి ఏ రాష్ట్రంపైనా ఇప్పటి వరకు ఒత్తిడి చేయలేదని తెలిపింది. సౌర విద్యుత్ కొనుగోలుకు రాష్ట్రాలను బలవంతం చేయట్లేదని, విద్యుత్ కొనుగోలు వ్యవహారాలన్నీ ఓపెన్ బిడ్ల ద్వారానే జరుగుతాయని కేంద్రం స్పష్టం చేసింది. ఆయా రాష్ట్రాలు విద్యుత్ అవసరాలకు అనుగుణంగా కొనుగోలు చేస్తాయని, ఇదంతా బహిరంగంగానే జరుగుతుందని తెలిపింది.ఇందులో ఎలాంటి దాపరికం లేదని స్పష్టం చేసింది. సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి అపోహలు, అవాస్తవాలు మాట్లాడటం సరికాదని పేర్కొంది.