చైనాకు చెందిన దిగ్గజ మొబైల్ కంపెనీ హువావే కార్యాలయాలపై ఆదాయపన్నుశాఖ దాడులు నిర్వహించింది.దిల్లీ, గురుగ్రాం, బెంగళూరుల్లోని కార్యాలయాల్లో ఈమేరకు సోదాలు జరిగాయి. కీలక సమాచారం లభించడంతో ఐటీశాఖ ఈ దాడులను ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఈ దాడులపై హువావే ఓ ప్రకటన విడుదల చేసింది. ‘’ఐటీ శాఖ అధికారులు మా కార్యాలయాన్ని సందర్శించారు. కొందరు అధికారులతో భేటీ అయ్యారు. భారత్లోని అన్ని రకాల చట్టాలను పాటిస్తున్నామని హువావే నమ్మకంగా చెబుతోంది. మేం మరింత సమాచారంతో ఆయా విభాగాలను కలుస్తాం. వారికి పూర్తి సహకారం అందిస్తాం’’ అని ఆ ప్రకటనలో పేర్కొంది.