Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

పోటెత్తుతున్న వరద


పశ్చిమ కనుమల్లో కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలతో కృష్ణా నదిలో వరద ప్రవాహం పెరుగుతోంది. దీంతో కృష్ణా బేసిన్‌లోని ఆల్మట్టి, నారాయణపూర్‌ జలాశయాలకు భారీగా వరద పోటెత్తుతోంది. డ్యామ్‌ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 123 టీఎంసీలు కాగా ప్రస్తుతం 94 టీఎంసీల నీరు నిల్వ ఉంది. దిగువకు 43,960 క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో ఆ నీరంతా నారాయణపూర్‌ డ్యామ్‌ వైపు ఉరకలేస్తోంది. అలాగే తుంగభద్ర డ్యామ్‌కు వరద పోటెత్తుతోంది. శుక్రవారం ఒక్కరోజే 40 వేల క్యూసెక్కుల ప్రవాహం చేరడంతో డ్యామ్‌లో జలకళ ఉట్టిపడుతోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img