కొనసాగుతున్న ప్రశ్నాపత్రాల లీక్ల పర్వం
పదో తరగతి పరీక్షల్లో భాగంగా ఇవాళ ఇంగ్లీష్ పరీక్ష జరిగింది. అయితే ఈ రోజు పరీక్ష ప్రారంభమైన వెంటనే క్వశ్చన్ పేపర్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. శ్రీసత్యసాయి జిల్లా ఆమడగూరు పాఠశాల నుంచి ఇంగ్లీష్ పేపర్ లీకయింది. పరీక్షలు ప్రారంభమైన తొలి రోజున తెలుగు పేపర్, రెండో రోజున హిందీ పేపర్ లీక్ అయ్యాయి. అయితే పేపర్ లీక్ కాలేదని అధికారులు చెప్పారు. నంద్యాల జిల్లాలో మాత్రం తెలుగు పేపర్ లీక్ కు సంబంధించి 12 మందిని అరెస్ట్ చేశారు.