Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

సీఎం జగన్‌కు అచ్చెన్నాయుడు లేఖ


ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి అచ్చెన్నాయుడు లేఖ రాశారు.అకాల వర్షాలకు పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని లేఖలో కోరారు. ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయిన రైతులకు అకాల వర్షాలు మనోవేదనకు గురిచేశాయని పేర్కొన్నారు. పలు ప్రాంతాల్లో చేతికొచ్చిన వరి, మిర్చి, మామిడి, నిమ్మ, సపోటాతో పాటు ఇతర ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. గత మూడేళ్లుగా అన్నదాతలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయారని పేర్కొన్నారు. ఓ వైపు గిట్టుబాటు ధరలు లేక.. మరోవైపు ప్రకృతి విపత్తులతో రైతులు ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి ఏర్పడిరదని లేఖలో తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img