జిల్లాయంత్రాంగం అప్రమత్తత పట్ల సీఎం హర్షంవ్యక్తం :
జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి
విశాలాంధ్ర-పార్వతీపురం : మొంథాతుపాన్ పోస్ట్ డిజాస్టర్ పై ప్రత్యేక దృష్టి సారించాలని, విధులనిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి అధికారులను హెచ్చరించారు. బుధవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జాయింట్ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రెడ్డితో కలసి మొంథా తుఫాన్ పై జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రభాకర్ రెడ్డి జిల్లాఅధికారులతో సమీక్షించారు.తుపాన్ పట్ల అప్రమత్తతలో, ముందస్తు చర్యలు తీసుకోవడంలో జిల్లా యంత్రాంగం చేపట్టిన చర్యలపట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారని జిల్లాకలెక్టర్ వివరించారు. జిల్లా అధికార యంత్రాంగానికి ముఖ్యమంత్రి తరఫున, తన తరుపున ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు తెలిపారు. సమీక్షలో ఎస్డిపిఓ, కెఆర్ఆర్సి ఎస్డిసి, ట్రైబల్ వెల్ఫేర్ ఎస్డిసి, సిపిఓ, విపత్తుల నివారణ, ఇరిగేషన్, ఏపీ ఈపీడీసీఎల్, డ్వామా పిడి, ఆర్అండ్బి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ లు, పంచాయతీరాజ్, వైద్య ఆరోగ్య, డిసిహెచ్ఎస్, పౌరసరఫరాలు, వ్యవసాయ, ఉద్యాన, మత్స్య, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, మహిళా శిశు సంక్షేమ, మున్సిపాలిటీ, అన్ని మండలాల పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్లు, ఇతర శాఖల అధికారులు పాల్గొని శాఖల వారీగా వివరాలను వివరించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రకృతి విపత్తుల వలన ఎటువంటి సమస్య వచ్చిన సమన్వయంతో సాధించవచ్చని గుర్తుచేశారు. స్థానిక నాయకులు, యువతనుంచి మనకి మంచి సహకారం అందిందని, ఇది అభినందించదగ్గ విషయమని సంతోషాన్ని వ్యక్తం చేశారు. కంట్రోల్ రూమ్ నిర్వహణపై అందరికీ అవగాహన అవసరమన్నారు. కంట్రోల్ రూమ్ లో విధులు నిర్వహించిన వారికి పూర్తిస్థాయి అవగాహన కల్పించాలని తెలిపారు. మనం ప్రస్తుతం మూడు విపత్తులనుదాటామని, ప్రస్తుతం పోస్ట్ డిజాస్టర్ ను ఎదుర్కోవడం ప్రధాన కర్తవ్యమన్నారు. అందులో ప్రధానమైనది పారిశుధ్యమని, ప్రతీవీధి శుభ్రంచేయాలన్నారు. నీటి నిల్వలను తొలగించి శుభ్రం చేయాలని, నిర్లక్ష్యం వహించకుండా ముందుకు సాగాలని తెలిపారు. ప్రతీవీధి, గ్రామం, వార్డుస్థాయి సిబ్బందితో పూర్తిస్థాయిలో శుభ్రం చేయించాలని ఆదేశించారు. అలాగే ఆర్డబ్ల్యూఎస్ అధికారులు త్రాగునీరు శుభ్రం చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. మట్టి గోడలు పాడైన, కూలిన వాటిని గుర్తించాలని, పశువులు, వ్యవసాయ నష్టాలను సంబంధిత అధికారులు జాప్యం లేకుండా అంచనాలను వేయాలన్నారు. సబ్ కలెక్టర్లు, తహసీల్దార్లు, మండల వ్యవసాయ అధికారులు త్వరితగతిన అంచనాలను చేపట్టాలన్నారు. తహాశీల్దార్లు, ఎంపీడీవోలు గ్రామాల్లో పర్యటించి నష్టాల అంచనా సిద్ధం చేయాలన్నారు.పాఠశాలలు ప్రారంభించవచ్చని, శిథిలావస్థలో ఉన్న పాఠశాల భవనాలు వినియోగించ కుండా సత్వర చర్యలు చేపట్టాలన్నారు. రానున్న రోజుల్లో రిజర్వాయర్లు లైవ్ డేటా వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలన్నారు. పిహెచ్సి, సిహెచ్సిలకు తరలించిన గర్భిణీలు మరికొన్ని రోజులు ఉండేలా చర్యలు చేపట్టాలన్నారు. ఏఎన్ఎమ్, ఆశా వర్కర్లు క్యాంపులు ఆపకుండా హెల్త్ క్యాంపులు నిర్వహించి, ప్రజలకు మందులు అందించి ప్రతీఒక్కరి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించడం అవసరమన్నారు.చెరువులు నిండుగా ఉన్నాయని, గండ్లు పడే అవకాశం ఉన్నందున ఇరిగేషన్, పంచాయతీరాజ్ అధికారులు పర్యవేక్షణ చేయాలన్నారు. శాఖల వారీగా పోస్ట్ డిజాస్టర్ చెక్ లిస్టు సిద్ధం చేయాలని, శాఖల వారీగా చేపట్టిన వివరాలు అందజేయాలన్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు షాపులపై దాడులు నిర్వహించాలన్నారు. ఎంపిడిఓలు మీ దిగువ సిబ్బంది విధుల్లో ఉన్నవారి డేటా అందజేయాలన్నారు. డిజాస్టర్ నిర్వహణలో నిర్లక్ష్యం వచ్చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విధులకు హాజరుకానివారి పేర్లు శాఖల వారీగా జాబితా అందజేయాలన్నారు.
జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పుడే ప్రభుత్వం 115 జిఓను విడుదల చేసిందని, రిలీఫ్ కేంద్రాల్లో ఉన్న వారికి కిట్లు అందజేయడం జరుగుతుందని అన్నారు. అందుకు సంబంధించిన జాబితా అందజేయాలని తెలిపారు.ఈసమీక్షా సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి కె.హేమలత, పార్వతీపురం సబ్ కలెక్టర్ ఆర్.వైశాలి, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. ఎస్.భాస్కర రావు, సిపిఓ ఎస్.ఎస్.ఆర్.పట్నాయక్, ఐసిడిఎస్ పి.డి టి.కనకదుర్గ, డ్వామా పిడి కె.రామచంద్రరావు, కలెక్టరేట్ ఏఓ కె.చిన్నారావు తదితరులు ఉన్నారు.
మొంథా తుపాన్ పోస్ట్ డిజాస్టర్ పై ప్రత్యేక దృష్టి సారించాలి
- Advertisement -
RELATED ARTICLES


