భద్రాచలంలో రూ.1.10 కోట్లతో నూతనంగా నిర్మించిన గిరిజన భవన్ను గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శుక్రవారం ప్రారంభించారు. ఆనంతరం గిరిజన భవన్లో సమీకృత గిరిజనాభివృద్ది సంస్థ ఉమ్మడి ఖమ్మం జిల్లా పాలక మండలి సమీక్ష సమావేశంలో మంత్రులు పువ్వాడ, సత్యావతి పాల్గొన్నారు.