Wednesday, May 1, 2024
Wednesday, May 1, 2024

పయ్యావుల కేశవ్‌ భద్రతను పునరుద్ధరించాలి: అచ్చెన్నాయుడు

టీడీపీ ఎమ్మెల్యే, పీఏసీ ఛైర్మన్‌ పయ్యావుల కేశవ్‌కు రాష్ట్ర ప్రభుత్వం భద్రతను తొలగించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందిస్తూ వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. పెగాసన్‌, ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారాల్లో ఆధారాలతో సహా ప్రభుత్వాన్ని ఎండగడుతూ, అక్రమాలను ప్రశ్నిస్తున్నారని తమ పార్టీ ఎమ్మెల్యే, సీనియర్‌ నాయకుడు అయిన పయ్యావుల కేశవ్‌ గారి సెక్యూరిటీ ఉపసంహరిస్తారా? అని ప్రశ్నించారు. ప్రతీకార రాజకీయాలు చేయడానికా మీకు ప్రజలు పట్టం కట్టింది? అని అడిగారు. తక్షణమే పయ్యావుల కేశవ్‌ గారి భద్రతను పునరుద్ధరించాలని డిమాండ్‌ చేస్తున్నానని అన్నారు. మేము అధికారంలో ఉన్నప్పుడు ఇదే మాదిరిగా వ్యవహరిస్తే జగన్‌ రెడ్డి పాదయాత్ర చేయగలిగేవారా? అని ప్రశ్నించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img