Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి

విశాలాంధ్ర వలేటివారిపాలెం.బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో క్షతగాత్రుడు చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందినట్లు యస్ ఐ వేమర్తి వెంకటేశ్వర్లు తెలిపారు. బుధవారం రాత్రి వలేటివారిపాలెం పోలీస్ స్టేషన్ సమీపంలో ఓ ప్రవేటు స్కూల్ బస్సు రహదారి అంచున నిలబడి ఉండగా అదుపుతప్పి ఒక మోటర్ సైకిల్ డీ కొన్న సంఘటన పాఠకులకు విదితమే ఈ ప్రమాదంలో దానం నరేంద్ర (20)తలకు తీవ్రగాయాలు కాగా ఒంగోలు రిమ్స్ లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు యస్ ఐ వెంకటేశ్వర్లు తెలిపారు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు యస్ ఐ తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img