ఆర్డీవో మహేష్
విశాలాంధ్ర – ధర్మవరం;; దేశభక్తిని ప్రతి ఒక్కరూ చాటుకోవాలని ఆర్డిఓ మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆర్డీవో కార్యాలయంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను కార్యాలయ అధికారులు, సిబ్బంది నడుమ ఘనంగా నిర్వహించుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎంతోమంది స్వాతంత్ర సమరయోధులు మన దేశానికి స్వాతంత్రం తేవడం వల్లనే ఈరోజు మనం ఇలా ఉన్నామని వారు తెలియజేశారు. ఉద్యోగులందరూ తమ విధులను నిజాయితీతో, బాధ్యతతో సేవా భావంతో నిర్వర్తించాలని తెలిపారు. తదుపరి అందరికీ గణతంత్ర దినోత్సవ వేడుకల శుభాకాంక్షలు తెలియజేశారు. విధులలో ఉత్తమ అవార్డు అందుకున్న ఎనిమిది మంది ఉద్యోగస్తులకు స్వయంగా ఆర్డిఓ చేతుల మీదుగా సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏవో కతిజున్ కుప్రా, స్థానిక ఎమ్మార్వో సురేష్ బాబు, కార్యాలయ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
దేశభక్తిని ప్రతి ఒక్కరూ చాటుకోవాలి
- Advertisement -


