కొయ్యలగూడెం: పరింపూడి గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండడంతో , డ్రైనేజీ లేక మురుగునీరు రోడ్లపైనే ప్రవహించడంతో, తీవ్ర దుర్వాసన వెదజల్లుతుంది అని, వర్షం వచ్చిన సమయంలో వర్షపు నీరు కూడా రోడ్లపైనే ప్రవహించడంతో పరింపూడి రామాలయం వెనుక ఉన్న రోడ్డుపై నూతనముగా సర్పంచ్ ముప్పిడి విజయ కుమారి, ఉప సర్పంచ్ సంకు కొండలరావు చొరవతో కల్వర్టును నిర్మించడం జరిగింది. కల్వర్టు నిర్మాణం పనులను కొండలరావు, వార్డ్ మెంబర్ పూలపల్లి రవికుమార్, ముప్పిడి చిన్నబాబు, రాచూరి మదన్, ఊసల దివ్య రాజేష్, కుతాడి బాలు,మండ నాగేశ్వరరావు, ఆర్డబ్ల్యూఎస్ సిబ్బంది లక్ష్మణ్ రావు పరిశీలించారు. దీర్ఘకాల సమస్యలు పరిష్కారం చూపుతున్న పంచాయితీ పాలకవర్గ సభ్యులను గ్రామస్తులు అభినందించారు.