Thursday, May 9, 2024
Thursday, May 9, 2024

డిజిటల్ రంగానికి ఆద్యుడు రాజీవ్ గాంధీ

జంగారెడ్డిగూడెం :నేడు భారతదేశం డిజిటల్ రంగంలో ముందుకు దూసుకు వెళ్తుందంటే అందుకు కారణం భారత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కమ్యూనికేషన్ రంగాన్ని దేశానికి పరిచయం చేసి అభివృద్ధి చేయడమే అని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు జెట్టి గురునాధరావు అన్నారు.శనివారం రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను పట్టణంలో నిర్వహించారు.ఈ సందర్భంగా స్థానిక బస్టాండు వద్ద, పంగిడిగూడెం రోడ్ లో ఉన్న ఈ సేవా సెంటర్ వద్ద ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్బంగా జెట్టి గురునాథరావు మాట్లాడుతూ దేశాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం వాణిజ్య వ్యాపార రంగాలను అభివృద్ధి చేసి ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ముప్పిడి శ్రీనివాసరావు, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ హిరాకిం, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ప్రగల్లపటి పాటి కాశి, పట్టణ కార్యదర్శి సోమేశ్వరరావు, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాడేపల్లి ఉమా, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మొగిలినీడిశ్యాం, బీసీ సెల్ అధ్యక్షులు జీడిగంటి రామారావు, కిసాన్ సెల్ విభాగం అధ్యక్షులు పిండి రాము మైనారిటీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ జమీర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img