Tuesday, April 30, 2024
Tuesday, April 30, 2024

ఏపీలో స్కూళ్లకు ఈ నెల 27న సెలవు.. ఎందుకంటే !

ఏపీలో స్కూల్‌ విద్యార్థులకు ముఖ్య గమనిక. శనివారం (ఆగస్టు 27) పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఆజాదీకా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా ఈనెల రెండో శనివారం (ఆగస్టు 13)న పాఠశాలలు పనిచేసిన సంగతి తెలిసిందే. దానికి బదులుగా నాలుగో శనివారం సెలవు ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాలను పురస్కరించుకుని స్వాతంత్య్ర దినోత్సవ ఏర్పాట్ల కోసం ఈనెల రెండో శనివారం పాఠశాలలు పనిచేశాయి. సెలవు దినంలో స్కూళ్లు, ఇతర విద్యాసంస్థలు పనిచేసినందున దానికి ప్రత్యామ్నాయంగా 27వ తేదీని సెలవు దినంగా పరిగణించుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు కమిషనర్‌ కె.సురేష్‌కుమార్‌ గురువారం సర్క్యులర్‌ జారీ చేశారు. ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ వేడుకల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. ప్రతి గ్రామంలో ఇళ్లపై జాతీయ జెండాలు ఎగురవేశారు. అంతేకాదు ఈ సందర్భంగా రాష్ట్రంలోని స్కూళ్లలో ఈ నెల 15 వరకు డ్యాన్స్‌, మ్యూజిక్‌, ర్యాలీలు, పెయింటింగ్‌, గ్రూప్‌ డిస్కషన్స్‌, జాతీయ జెండాలతో సెల్ఫీలు దిగి అప్‌లోడ్‌ చేయడం లాంటి కార్యక్రమాలు నిర్వహించారు. అందుకే ఆగస్టు 13ని వర్కింగ్‌ డేగా విద్యాశాఖ పేర్కొంది. ఇప్పుడు దానికి బదులుగా ఆగస్టు 27న సెలవు దినంగా ప్రకటించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img