Tuesday, April 30, 2024
Tuesday, April 30, 2024

తోటపల్లి దేవస్థానాన్ని తక్షణమే నిర్మించాలి

ప్రజాప్రతినిదులు డిమాండ్

విశాలాంధ్ర,పార్వతీపురం/గరుగుబిల్లి: ఉత్తరాంధ్రలో చినతిరుపతిగా పేరుగాంచిన తోటపల్లి శ్రీవెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని తక్షణమే నిర్మించాలని ప్రజా ప్రతినిధులు, గ్రామ పెద్దలు డిమాండ్ చేశారు. శనివారం

తోటపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయం ఇంఛార్జి ఎక్జిక్యూటివ్ ఆఫీసర్ నగేష్ ఏర్పాటు చేసిన అత్యవసర సమావేశం లో పలు నిర్ణయాలు తీసుకున్నారు.స్థానిక ఎమ్. ఎల్. ఏ.ను కలసి అభివృద్ధి కమిటీ ఏర్పాటుకు సహకరించాలని కోరడం, విరాళాలు సేకరించడం,గుడి నిర్మాణం భాధ్యతలు కమిటీ ద్వారా చేయించడం, బ్యాంక్ భవన నిర్మాణం మరమ్మతులు జరిపించడం,కూలిన భవనాలు తొలగించడం, దేవాలయం పూర్వ వైభవానికి కృషి చేయాలని తీర్మానించారు. ఈకార్యక్రమంలో జట్టు అధినేత డాక్టరు నాయుడు, సంతోషపురం సర్పంచ్ అంబటి రాంబాబు,తోటపల్లి ఎంపిటిసి సింహాచలం, సంతోషపురం ఎంపిటిస శ్రీనివాసరావు,గిజబ సర్పంచ్ భాగ్యలక్ష్మి శంకరరావు, దేవస్థానం మాజీ ఛైర్మన్ గంగాధర రావు, వైసీపీ నాయకులు అంబటి గౌరు నాయుడు, వినాయక దేవాలయం ఛైర్మన్ తామాడ దుర్గారావు , మాజీ సర్పంచ్ పకీరు నాయుడు, మంచిపల్లి శ్రీరాములు, దేవాలయం కాంట్రాక్టర్ సింహాచలం దేవస్థానం సిబ్బంది మొదలగువారు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img