Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

యధాతథంగా టీఆర్‌ఎస్‌ జనరల్‌ బాడీ మీటింగ్‌

తెలంగాణ భవన్‌ లో దసరా నాడు (అక్టోబర్‌ 05) ఉదయం 11 గంటలకు తలపెట్టిన టీఆర్‌ఎస్‌ పార్టీ జనరల్‌ బాడీ మీటింగ్‌ యధావిధిగా జరగుతుందని టీఆర్‌ఎస్‌ అధినేత, సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. మునుగోడు ఉప ఎన్నికల నోటిఫికేషన్‌ నేపథ్యంలో దాని ప్రభావం, దసరా నాటి టీఆర్‌ఎస్‌ సర్వసభ్య సమావేశం పైన ఉండదని.. సభ్యులు అనుమానాలకు గురికావద్దని అన్నారు. ముందుగా ప్రకటించినట్టే అక్టోబర్‌ 05వ తేదీన ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్‌ లో పార్టీ సర్వసభ్య సమావేశం కొనసాగుతుందని సీఎం కేసీఆర్‌ పునరుద్ఘాటించారు. అందరూ నిర్దేశిత సమయంలోపే హాజరుకావాలన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img