తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సీట్లను 119నుంచి 153కు పెంచాలని, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ సీట్లను 175నుంచి 225కు పెంచాలని పిటిషన్లు దాఖలు కావడంతో.. ఈ పిటిషన్ల పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. నాలుగు వారాల్లో అఫిడవిట్లు దాఖలు చేయాలని ఈసీ, కేంద్రం, ఏపీ, తెలంగాణలకు సుప్రీంకోర్టు ఆదేశించింది.అనంతరం తదుపరి విచారణను సుప్రీంకోర్టు 8వారాలకు వాయిదా వేసింది.