సీఏం సహా పలువురు ప్రముఖుల దిగ్భ్రాంతి
ఆంధ్రప్రదేశ్ శాసపమండలి సభ్యుడు చల్లా భగీరథ రెడ్డి ఈరోజు కన్నుమూశారు. ఆయన వయసు 46 సంవత్సరాలు. అనారోగ్యం కారణంగా హైదరాబాద్ లోని ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఈ మధ్యాహ్నం మృతిచెందారని వారి కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. భగీరథ రెడ్డి భార్య లక్ష్మి ప్రస్తుతం అవుకు జడ్పిటిసిగా ఉన్నారు. గత ఏడాది జనవరిలోనే ఎమ్మెల్సీగా ఉంటూ భగీరథరెడ్డి తండ్రి చల్లా రామకృష్ణారెడ్డి మృతి చెందారు. తండ్రి మరణం తర్వాత ఎమ్మెల్యే కోటాలో భగీరథ రెడ్డికి సీఏం జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. తండ్రి చనిపోయి రెండేళ్లు కూడా గడవకముందే ఎమ్మెల్సీగా ఉన్న కొడుకు భగీరథరెడ్డి మృతి పట్ల బనగానపల్లె నియోజకవర్గంలో విషాదం నెలకొంది.