Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

అధికవర్షాలతో నష్టపోయిన జిల్లా రైతులను ఆదుకోవాలి

ఆత్మకూరు మండల ఉప తహశీల్దార్‌, వరప్రసాద్‌కి వినతి పత్రం అందజేసిన సిపిఐ నాయకులు
విశాలాంధ్ర` అనంతపురం వైద్యం : ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో, జిల్లా పిలుపు మేరకు,ఆత్మకూరు మండలం,సమితి అద్వర్యములో , బుధవారం డిప్యూటీ తాసిల్దార్‌ కు రైతు సంఘం నాయకులు సనప నీళ్లపాల రామకృష్ణ,, బండారు శివ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మండల,వ్యాప్తంగా అధికవర్షాలతో వేరుశనగపత్తి,అముదము,జోన్న,మొక్కజోన్న,తదితర మరియు ఉద్యానపంటలు,అతివృష్టితో పెట్టిన పెట్టుబడి కూడ రాక ప్రయివేట్‌ వ్యక్తులు దగ్గర అప్పులు తీసుకొని సాగు చేసి తీవ్ర నష్టాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు గురి అవుతున్నారు అన్నారు. పాలకులు ఏమాత్రము రైతులకు నష్ట ఫలాలు అంధింఛడము పూర్తీగా విఫలమయ్యారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో నష్టపోయిన పంటలకు,ఏకరాకు 25000వేల రూ’’పంటనష్టపరిహరము అంధించాలని,పండ్లతోటలకు ,కాయగూరల పంటలకు ఏకరాకు 50,000వేలరూ’’ నష్టపరిహరము,అందించాలని, స్పింక్లర్లు,డ్రిప్‌ పరికరములు,రైతులకు 90శాతము సబ్సీడీతో ఇవ్వాలి,పరికరాలపై విదించే జిఎస్టి మొత్తాన్ని ప్రభుత్వమే భరించాలని, వైసిపి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకోచ్చి మన రైతాంగానికి రావల్సిన సంక్షేమ ఫలాలను వచ్చేంతవరకు ఉద్యమిస్తామని ఏపీ రైతు సంఘం నాయకులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల రైతులు, బి రామాంజనేయులు, ముత్యాలప్ప, గోవిందు, నల్లప్ప, నల్లమ్మ, లక్ష్మీదేవి,గోపాల్‌ నాయక్‌, నరసింహులు, తాతయ్య, దిలీప్‌, రాముడు, మస్తాన్‌, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img